Pages

దర్శనం అయ్యాక ఆలయంలో ఎందుకు కుర్చోవాలి

Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

స్వామి దర్శనము, షడగోప్యము అయ్యాక కొంతసేపు కూర్చొని వెళ్ళాలి అని అంటారు పెద్దలు.
అలా కూర్చుంటే మనసుకు ప్రశాంతత ,పుణ్యం అని పెద్దల పలుకు.
అలా కూర్చోకుండా వెళ్తే భగవంతుని దర్శించిన ఫలితం కుడా రాదూ అని అంటారు.
అలా ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని మంచీ, చెడులను ఆలోచించి మంచి వైపు మార్గాన్ని ఎంచుకొనే అవకాశాన్ని మన మనసుకు యిస్తాము.
మనం రొజూ చేసే పనులలో మంచిని ఎంచుకొనే అవకాశం దక్కుతుంది.
ఇలా ఆలయంలో కూర్చోవడం ఒక రకమైన ద్యానం వంటిది. అలా ఒక 2నిమిషాలా పాటు మౌనముగా కూర్చొని మనం దర్శించిన ఆ భగవంతుని తిరిగి స్మృతి చేసుకుంటే వచ్చే ఆ ఆనందం, ప్రశాంతత చాలా ఉత్తమమైనది