Clsr

Recent Posts

ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు?



Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు దళములు కలపి ఒక్క అండముగా పిలవబడును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,
"పూజకుడు -పూజ్యము -పూజ",
"స్తోత్రము -స్తుత్యము - స్తుతి",
"జ్ఞాత -జ్ఞేయము -జ్ఞానము"
అని అర్థాలు చెప్పు చున్నారు. ఈ విధంగా (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు.
“పూజ చేయువాడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” - అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము. ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని - బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను. ‘శివోహం - శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.