Clsr

Recent Posts

History of copper & its importance in India

భారతదేశంలో రాగి చరిత్ర మరియు విశిష్టత

రాత్రి రాగి చెంబులో మంచి నీళ్ళు వుంచి పరగడుపున తాగితే హాయిగా జీవించవచ్చు.
రాత్రి నిద్ర పోయోముందు అర లీటర్ నుండి లీటర్ ఉండే రాగి చెంబు నిండా మంచినీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచి లేవగానే రెండు సార్లు పుక్కిలించి ఊసి ఆ రాగి చెంబులోని నీళ్లు తాగాలి . దీనివల్ల 15 నిమిషాల నుండి అర గంటలోపు సుఖ విరోచనం అవుతుంది. గ్యాస్, కడుపుబ్బరము, కడుపులో మంట, మలబద్ధకం, తేపులు, మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో ఎటువంటి ఔషదాలు వాడే పని లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం అనేది అన్ని వ్యాదుల్ని కలిగించడానికి మూలకారణం కాబట్టి ఈ అలవాటు తో మలబద్ధకం నివారించుకుంటే హాయిగా జీవించవచ్చు.

ఇక రాగి చెంబులో నీళ్ళే ఎందుకు తాగాలి వేరేవి ఉన్నాయి కదా అని కొందరికి సందేహం రావచ్చు . రాగి గురించి వరాహ పురాణం లో వివరంగా ఉంది ఈ రాగి ఏడువేల యుగాల క్రితమే విష్ణు మాయ కారణంగా పుట్టింది . గూడ కేశుడు అనే ఒక రాక్షసుడు తామ్ర ( రాగి) రూపంలో విష్ణు మూర్తిని ఆరాధించేవాడు అతని భక్తి కి మెచ్చి వరం కోరుకోమంటే గూడ కేశుడు తన అవయవాలన్ని తామ్ర( రాగి) రూపం దాల్చాలని భగవదారాధనకు ఆ పాత్ర లనే వాడాలని కోరుకుంటాడు. విష్ణు మూర్తి సుదర్శన చక్రంతో ఒక శుభ మూహూర్తం లో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు గూడ కేశ సంహరం జరిగింది . అతని కోరిక నెరవేరింది . ఆనాటి నుండి మనకు తామ్ర( రాగి) పాత్రలు ప్రాప్తించాయి. అందుకే ఇప్పటికీ దేవాలయాలల్లో, యజ్ఞం లో రాగి పాత్రల ను మాత్రమే వాడతారు అంతేగాక రాగి కి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది .


 

Importance of Karthika Pournami



కార్తిక పౌర్ణమి



సౌందర్యాన్ని ఆశ్చర్యపరిచే జగత్సౌందర్యమే కార్త్తిక పూర్ణిమ. కార్త్తిక మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే తిథులలో కార్త్తిక పూర్ణిమ ఒకటి. శంకరుని అతి ప్రియమైన రోజు ఇది. ఈ రోజు కుమారస్వామిని దర్శించాలి. ఈశ్వరాలయాల్లో జ్వాలాతోరణం చేస్తారు. ఈరోజు చేసే దీపదానానికి ఎంతో విశేష ప్రాముఖ్యం ఉంది. శివుడు త్రిపురాసుడిని సంహరించింది ఈ పౌర్ణమినాడే. అందుకే త్రిపుర పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఉదయంనుంచి ఉపవాసంఉండి ప్రదోషంలో అంటే సాయంకాంలో స్ర్తిలు దీపాలను వెలిగించాలి. తరువాత పురుషులు ఆ దీపాలను విధివిధానంగా ఆరాధించాలి. ఈ దీపారాధన ఉసిరిక చెట్టుకింద చేస్తే విశేష ఫలితాల్ని పొందవచ్చు. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టి దోషపరిహారం కోసం ఇంకా విజయుడైన అతని గౌరవార్ధం పార్వతీదేవి మొదటిగా ఈ జ్వాలా తోరణాన్ని జరిపించిందనీ అప్పటినుండి ఇది ఆచారమైనదని కథనం. ఈ జ్వాలా తోరణాన్ని దర్శించడం వల్ల సర్వ పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారించబడుతుందని ప్రతీతి. గడ్డిని తోరణంగా పేని దాన్ని వెలిగించి మంట చేసి ఆ మంటను కిందినుంచి పార్వతీదేవిని అటు ఇటు తిప్పుతారు. దీన్ని జ్వాలా తోరణం అంటారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినపుడు వెలువడ్డ హాలాహలాన్ని భరించలేక లోకాలు తల్లడిల్లిపోతుంటే తన భర్తను వేడుకుని హాలా హలాన్ని స్వీకరించి లోకాన్ని రక్షించమని ప్రార్థిస్తుంది. దానికి గుర్తుగానే ఈ జ్వాలా తోరణాన్ని నేటికీ వెలిగిస్తారంటారు. కొందరు ఈరోజు తులసిచెట్టు, ఉసిరి చెట్టు ముందు ముగ్గు పెట్టి, దీపం వెలిగించి షోడశోపచార పూజ చేసి తులసి దగ్గరే వంట చేసుకుని భోజనం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే తులసి, ఉసిరి చెట్లను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించి మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు శివుడిని పూజించి భక్తేశ్వర వ్రతం చేయాలి. ఈ దినం పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వ్రతం చేసినట్టయితే వైధవ్య బాధలు వుండవని శాస్త్రాలు చెప్తున్నాయి.

కార్తిక పౌర్ణమి రోజున ముత్తయిదువలు ఆచరించి తమ ఐదోతనాన్ని కాపాడమని పరమేశ్వరుడ్ని ప్రార్థించుకుంటారు. సాక్షాత్తు సర్వమంగళాదేవి అయిన మంగళగౌరి కూడా కార్తీకమాసంలో దీపాల్ని వెలిగించి మురిసిపోతుందిట. అందుకే ఈరోజు దీపారాధనకు ప్రాముఖ్యత ఏర్పడింది.

కార్తికపూర్ణిమ నాడు మనసును ప్రశాంతంగా ఉంచి, ‘ఓం నమఃశ్శివాయఅంటే చాలు, ఒక పవిత్ర శక్తి ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రదక్షిణం చేసి గంగలో మూడు మునకలు వేసి పరమోత్కృష్టమైన కైలాస శిఖరాన్ని తాకి, మనపై కారుణ్యామృతాన్ని వర్షిస్తుందని శివపురాణం స్పష్టం చేస్తోంది. జలం, జ్వాల ఈ రెండును ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే నదుల్లో స్నానమాచరించి, దీప తోరణాలను చెరువుల్లోకానీ, బావుల్లోకానీ నదుల్లోకానీ వదలడం కన్నుల పండువగా కన్పిస్తుంది. కార్తీక దామోదరునిగా ప్రసిద్ధి చెందిన విష్ణువును ఉసిరిక చెట్టుకింద దీపంపెట్టి వేదపఠనం కావించి అర్చిస్తారు. తులసి కోట దగ్గర శివాలయంలోను మున్నూట అరవై వత్తులతో దీపారాధన చేస్తారు.
శ్రీహరి దేవేరియైన శ్రీ మహాలక్ష్మి కార్తీకపూర్ణిమనాడు ఇంటింటికీ వస్తుందని, ఏ ఇంట శివలింగారాధన జరుగుతుందో శివనామ స్మరణ జరుగుతుందో ఆ ఇంట రహస్య శక్తులతో ప్రవేశిస్తుంది. దీపాలు ఎవరి ఇంట ఈరోజు సాయంకాలం వెలిగిస్తారో వారి దారిద్య్రం తొలగిపోతుంది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలి ఆకాశాన నిండు చంద్రుడు నిలిచిన పూర్ణిమనాడు చంద్రోదయ సమయంలో నదులలో, అరటి దొప్పలలో ఆవునేయితో దీపాలను వెలిగించి వదులుతారు. అందుకే కార్తీక మాసానికి సమమైన మాసం ఇంకేదీ లేదని చెప్తారు. ఇన్ని లక్షణాలున్న కార్తీక మాసాన్ని, ముఖ్యంగా పౌర్ణమినాడు మనమందరం కూడా దీపారాధన చేసి దీపాలను నీటిలో వదిలి ఆ శివకేశవుల ప్రీతికి పాత్రులవుదాం.

Importance of Season of Karthika Maasam


HEALTH TIPS FOR LEGS PAIN IN TELUGU

మోకాళ్ళ నొప్పులకు చిట్కాలు 

1) అల్లం

అల్లంలో అనాల్జెసి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది. కాబట్టి, కొద్దిగా అల్లం నూనెను మోకాళ్ళకు అప్లై చేసి స్మూత్ మసాజ్చేయాలి.అలాగే మీరు కొద్దిగా అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు.



2) యూకలిప్టస్ ఆయిల్:
యూకలిప్టస్ నూనె చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు ఇది ఒక పవర్ ఫుల్ పెయిన్ కిల్లర్ . ఇది కండరాలకు ఉపశమనం కలిగించే గుణంలో ఇందులో ఉంది. ఇది మోకాలుకు రక్తప్రసరణను పెంచుతుంది. అందువల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గిస్తుంది. నొప్పి ఉన్నప్రదేశంలో ఈ నూనెను నేరుగా అప్లై చేసి, మసాజ్ చేయాలి . మోకాళ్ళ నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
3) కర్పూరం నూనె
కర్పూరం నూనె, చాలా ఎఫెక్టివ్ గా జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది. చర్మానికి దీనిలో చాలా కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది మరియు నొప్పి వల్ల కలిగి చిరాకును కూడా తగ్గిస్తుంది . ఇది కౌంటర్ ఇర్రిటెంట్ గా పనిచేస్తుంది .
4) ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్)
ఎప్సమ్ సాల్ట్ లో ఉండే హైలెవల్స్ మెగ్నీషియం మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది. ఈ సాల్ట్ ను నీళ్ళలో వేసి, కరిగిన తర్వాత ఈ నీటిలో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇంకా మీరు ఈ ఎప్సమ్ సాల్ట్ యొక్క నీటితో స్నానం కూడా చేయవచ్చు.
5) ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో సల్ఫైడ్ ఎక్కువగా ఉండటం వల్లే వాటికి అలాంటి ప్రత్యేకమైన కలర్ కలిగి ఉంటుంది. కాబట్టి, వీటిని తరచూ తినడం వల్ల జాయింట్ పెయిన్ ను నివారిస్తుంది .
6) ఐస్ ప్యాక్
మోకాళ్ళ నొప్పులను తక్షణం నివారించుకోవడానికి ఐస్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి తగ్గించబడుతుంది. ఐస్ ప్యాక్ ను పది నుండి ఇరవై నిముషాలు అప్లైచేయాల్సిఉంటుంది. 

SAUNF IS THE BEST THING FOR GOOD DIGESTION (IN TELUGU)

పొట్ట ఉబ్బరం , అజీర్ణం & గ్యాస్ సమస్యలకు సోంపు గింజలు

1) సోంపు గింజలు పొట్ట ఉబ్బరం , గ్యాస్ సమస్యలు , అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి.
2) ఒక స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి గోరువెచ్చగా తీసుకోవాలి.
3) పొట్ట ఉబ్బరంగా , గ్యాస్ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాలి. లేదంటే రెండు పూటలా భోజనం చేసాక తీసుకోవాలి.
4) గ్యాస్ సమస్యలతో ఉన్నవారు పులుపు , కారం , మసాలాలు , జంక్ ఫుడ్ తగ్గించాలి.
5) వేళకు భోజనం చేసి , వేళకు నిద్రపోవాలి. కనీస వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.

శ్రీరామనవమి Special Artical About Kodandaramaswamy Temple at ONTIMITTA, KADAPA, ANDHRA PRADESH, INDIA

 శ్రీరామనవమి 28-03-2015

శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.
పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో అడుగిడిన శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
ఈసారి ఆంద్ర ప్రదేశ్ లో కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయములో ప్రభుత్వం శ్రీరామ నవమి
వేడుకలు జరపాలని నిర్ణయించింది కళ్యాణం కుడా అక్కడే నిర్వహిస్తారు
ఈ చైత్ర శుద్ధ నవమి నాడే సీతారామ కళ్యాణము జరిగినది .... తెలంగాణా గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు విశిష్టమైన హిందూ దేవాలయం.
ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది
. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ది చెందినది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.
రామాయణం (రాముని జనన విషయం)
రామాయణం లో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర,కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు.

వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్ర కు ఇచ్చారు
. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్యకు రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.
ఉత్సవం
ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
ఉత్సవంలో విశేషాలు
ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.

దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
భద్రాచలం లో రామదాసు చే కట్టబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.
రామ రాజ్యం
దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు
. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు
. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైక కు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే అని రాముని స్మరిస్తారు


Healthy Tips for your Eyes in Telugu



Happy Ugadi to all the readers