ఆ తరువాత ఆ అధికారి వద్దకు వెళ్లి- 'మీరులోనికి రండి . వచ్చి కూర్చోండి, నేనే మీరు కలవాల్సిన మంత్రిని' అన్నాడు. సాదాసీదాగా ఉన్న అతగాడిని చూసి ఆ కొత్త ఆఫీసరు కంగుతిన్నాడు. ఇందాక తను చూచిన వ్యక్తే లాల్బహదూర్ శాస్త్రి అని పోల్చుకున్నాడు. తన పొరబాటును క్షమించమని ఎంతగానో వేడుకున్నాడు.
అందుకు శాస్త్రీజీ- 'మరేం ఫరవాలేదు. పని చిన్నది పెద్దది అని వుండదు. చేసే పనిని బట్టి మనుషుల్ని విలువకట్టడం సరికాదు. మనుషుల్ని మానవతా దృష్టి తో చూడడం నేర్చుకుంటే మంచిది' అంటూ హితబోధ చేశారు. శాస్త్రిజీ నిరాడంబరజీవి . మానవతా మూర్తి అందుకే అంత గొప్పవారుగా పేరు పొందారు మరి?ఈ తరం నేతలు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.